ఏపీలో మరో నిర్భయ ఘటన.. మైనర్‌ను వదలని కామాంధులు

by  |
young woman raped
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో ఆడవారిపై లైంగిక దాడులు పెరిగిపోతున్నాయి. ముక్కుపచ్చలు ఆరని చిన్నారుల నుంచి వృద్ధులపై కూడా కామాంధులు అత్యాచారానికి పాల్పడుతున్నారు. తాజాగా కృష్ణా జిల్లా కత్తివెన్నులో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి దగ్గర ఒంటరిగా ఉన్న 14ఏళ్ల బాలికపై అదే ప్రాంతానికి చెందిన ఓ యువకుడు కన్నేశాడు. ఆ బాలికకు మాయమాటలు చెప్పాడు. అతడి మాయమాటలు నమ్మిన బాలిక అతడి వెంట వెళ్లింది. బాలికను నిందితుడు గొడ్ల చావిడికి తీసుకెళ్లాడు. అప్పుడే అక్కడ మాటు వేసిన మరో ఇద్దరు యువకులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అయితే బాలిక కనిపించకపోయేసరికి తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలిక ఆచూకి తెలుసుకున్నారు. అయితే బాలిక జరిగిన ఘోరాన్ని చెప్పి విలపించింది. దీంతో పోలీసులు నిందితులపై ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు.

Next Story

Most Viewed