బ్రేకింగ్.. గ్యాంగ్ రేప్ నిందితులను పట్టించిన సెల్‌ఫోన్.!

by  |
Guntur gang rape
X

దిశ, వెబ్‌డెస్క్ : గుంటూరు గ్యాంగ్ రేప్ నిందితులను సెల్ ఫోన్ పట్టించింది. అమరావతి సీతానగరంలో బ్లేడ్‌బ్యాచ్ హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. కృష్టా నదీ తీరంలో స్నేహితుడితో కలిసి వెళ్తున్న ఓ యువతిపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుడి కాళ్లు చేతులు కట్టేసి.. యువతిపై లైంగిక దాడి చేశారు. అనంతరం బాధితురాలు, ఆమె ప్రియుడి సెల్‌ఫోన్‌లను కీచకులు లాక్కున్నారు. అనంతరం ఒక సెల్‌ఫోన్‌ను విజయవాడకు చెందిన కిరణ్ అనే వ్యక్తి వద్ద నిందితులు తాకట్టు పెట్టారు.

ఈ క్రమంలో కిరణ్ భార్య సెల్‌ఫోన్ ఆన్ చేసింది. ఫోన్ సిగ్నల్ ట్రాకింగ్ ద్వారా.. బాధితురాలి సెల్‌ఫోన్ ఎక్కడుందో పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో పోలీసులు వెంటనే కిరణ్ దంపతులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే కిరణ్ భార్య మాత్రం ఈ కేసుతో తన భర్తకు ఎటువంటి సంబంధంలేదని చెబుతున్నారు. తక్కువ ధరకే సెల్‌ఫోన్ వస్తున్నందన ఫోన్ తాకట్టు పెట్టుకున్నామని ఆమె తెలిపారు.

Next Story

Most Viewed