అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్

by  |
అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
X

దిశ, బూర్గంపాడు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న స్మగ్లింగ్ ముఠాను బూర్గంపాడు ఎస్‌ఐ తన సిబ్బంది‌తో పట్టుకున్నారు. ఏఎస్పీ రోహిత్ రాజు అధ్వర్యంలో శనివారం రోజు ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశాంలో ఆయన వివరాలు వెల్లడించారు. మండల పరిధలోని మోరంపల్లి బంజర్ గ్రామం‌లో ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద శనివారం ఉదయం 6గంటలకు ఎస్‌ఐ జితేందర్ వారీ బృందం‌తో కలిసి వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానా‌స్పదం‌గా కనిపించిన నలుగురిని పట్టుకొని తనిఖీ చేయగా 82కిలోల నిషేధిత గంజాయి దొరికిందని తెలిపారు. నిదింటులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించగా ఔరంగాబాద్ నుండి సీలేరు వచ్చి ఇక్కడ గంజాయి కొనుగోలు చేసి మళ్ళీ అక్కడ నుండి ఔరంగాబాద్ వెళుతున్నామని చెప్పారన్నారు. వీరి వద్ద నుండి 2 స్కూటీలు 82 కిలోల గంజాయిని పట్టుకొని సీజ్ చేశారు. వీటి విలువ సుమారు 16.48 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీ‌ఐ సత్యనారాయణ , ఎస్ ఐ జితేందర్ ట్రైనీ ఎస్ ఐ విజయ లక్ష్మి సిబ్బంది పాల్గొన్నారు.



Next Story

Most Viewed