‘గంధర్వ’ షూటింగ్ షురూ

by  |
‘గంధర్వ’ షూటింగ్ షురూ
X

దిశ, వెబ్‌డెస్క్: ‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. ఆయన హీరోగా గాయత్రి ఆర్.సురేశ్, అక్షత శ్రీనివాస్ హీరోయిన్స్‌గా యస్ అండ్ యమ్ క్రియేషన్స్, వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకాలపై అప్సర్ దర్శకత్వంలో ఎం.ఎన్ మధు నిర్మిస్తున్న చిత్రం ‘గంధర్వ’. ఈ చిత్ర పూజా కార్యక్రమాలు రామనాయుడు స్టూడియోలో నిర్వహించారు. హీరో సందీప్ మాధవ్, హీరోయిన్ అక్షత శ్రీనివాస్ పై చిత్రికరించిన ముహూర్తపు సన్నివేశానికి వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా శ్రీకాంత్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సన్నివేశానికి డైరెక్టర్ క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు.

వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ అధినేత వీరశంకర్ మాట్లాడుతూ మంచి సెన్సిబిలిటీస్ ఉన్న డైరెక్టర్ అప్సర్..ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ గంధర్వ అనే అద్భుతమైన కథను రెడీ చేశాడని చెప్పారు. ఈ కథకు సందీప్ అయితే యాప్ట్‌గా ఉంటుందని సెలెక్ట్ చేశామని తెలిపారు. సోమవారం నుంచి కంటిన్యూయస్‌గా రెగ్యులర్ షూటింగ్ జరుపుతామని, మే నెలలో చిత్రాన్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నామని నిర్మాత మధు పేర్కొన్నారు. సాయికుమార్, సురేశ్, బాబుమోహన్ లాంటి సీనియర్ యాక్టర్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని సందీప్ మాధవ్ చెప్పాడు. తెలుగు సినిమా ఫార్మాట్‌కు ఓ కొత్త యాంగిల్‌ను ఈ సినిమా ద్వారా పరిచయం చేయబోతున్నట్లు తెలిపారు. మూవీలో ప్రతి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఉంటుందని డైరెక్టర్ అప్సర్ చెప్పాడు. ఈ చిత్రానికి డీవోపీ: జవహర్ రెడ్డి, మ్యూజిక్: రాప్ రాక్ షకీల్, స్క్రీన్-ప్లే: వీరశంకర్, దర్శకత్వం: అప్సర్, నిర్మాత: ఎం.ఎన్.మధు.

Next Story