- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, స్పోర్ట్స్ : ముంబయి ఇండియన్స్ జట్టుకు ఐదో సారి ఐపీఎల్ టైటిల్ సాధించిపెట్టిన రోహిత్ శర్మపై ప్రశంసల జల్లు కురుస్తున్నది. అతడి నాయకత్వ లక్షణాలపై అభిమానులే కాక మాజీ క్రికెటర్లు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మకు టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల కెప్టెన్గా నియమించాలని ఇంగ్లాండ్ మాజీ సారథి మైఖెల్ వాన్ అంటున్నారు.
మరోవైపు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. ‘రోహిత్ శర్మకు వెంటనే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలి. లేకపోతే ఇండియాకే నష్టం జరుగుతుంది. అతడికి వన్డేలు లేదా టీ20ల్లో సారథ్య బాధ్యతలు అప్పగించాలి. అవసరమైతే పరిమిత ఓవర్ల క్రికెట్కు రోహిత్నే నేతృత్వం వహించేలా బీసీసీఐ నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే ఆ రెండు ఫార్మాట్లలో కోహ్లీ కన్న రోహిత్ మెరుగ్గా ఉన్నాడు.’ అని గంభీర్ అన్నాడు. ఫార్మాట్కు ఒక కెప్టెన్ ఉండటం వల్ల పెద్ద నష్టమేం ఉండదని.. అలా చేయడం వల్ల కెప్టెన్లపై భారం కూడా తగ్గుతుందని ఈ మాజీ క్రికెటర్ వెల్లడించాడు.