‘టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం’

by  |
‘టీఆర్ఎస్‌ను ఓడించేందుకు ప్రజలు సిద్ధం’
X

దిశ, ముషీరాబాద్: టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ఫిబ్రవరి వరకు అవకాశం ఉన్నా దుబ్బాక దెబ్బతో ఆదరాబాదరాగా ఎన్నికలకు వెళ్లారని ఆయన విమర్శించారు. ఏదో రకంగా గెలవాలని దుర్మార్గపు ఆలోచనతోనే డిసెంబర్ 1న నిర్వహిస్తున్నారని ఆరోపించారు. గాంధీనగర్ డివిజన్‎లోని ఆంధ్రాకేఫ్ చౌరస్తా సమీపంలో ఏర్పాటు చేసిన బీజేపీ ఎన్నికల కార్యాలయాన్ని కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేశారు. దుబ్బాక దెబ్బతో టీఆర్ఎస్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. కానీ, ఎట్టి పరిస్థితుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముషీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల ఇన్‌చార్జీ జితేందర్ రెడ్డి, డా. లక్ష్మణ్, గాంధీనగర్ కార్పొరేటర్ అభ్యర్థి పావని, బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు.



Next Story