'సూర్యవంశీ' సెట్‌లో కత్రినా గేమ్స్

by  |
సూర్యవంశీ సెట్‌లో కత్రినా గేమ్స్
X

దిశ, వెబ్‌డెస్క్:‘మల్లీశ్వరి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసిన కత్రినా కైఫ్.. తర్వాత బాలీవుడ్‌లో బిజీ హీరోయిన్ అయిపోయింది. ‘మల్లీశ్వరి’లో రాజకుమారిగా కనిపించిన కత్రినా… నిజంగానే బాలీవుడ్ క్వీన్‌గా మారిపోయింది. వరుస హిట్లతో దూసుకెళ్తున్న ఈ భామ.. ప్రస్తుతం రోహిత్ శెట్టి -అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘సూర్యవంశీ’ చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకోగా… లాస్ట్ డేను ఫుల్‌గా ఎంజాయ్ చేసినట్లు తెలిపింది. టీం మొత్తం గేమ్స్‌ ఆడిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది కత్రినా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా… కత్రినా, అక్షయ్, రోహిత్ శెట్టిల ఎంజాయ్‌మెంట్ మామూలుగా లేదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.

కాగా ఈ మధ్యే రిలీజ్ అయిన ‘సూర్యవంశీ’ ట్రైలర్ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. మార్చి 24న రిలీజ్ కానున్న సినిమాపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ధర్మ ప్రొడక్షన్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తుండగా.. అజయ్ దేవగన్, రణ్‌వీర్ సింగ్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు.



Next Story

Most Viewed