- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, భూపాలపల్లి: సింగరేణి కార్మికులు మూడు రోజులపాటు చేస్తున్న సమ్మెకు తమ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతుందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఆయన గురువారం సాయంత్రం భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వము ప్రభుత్వ ఆస్తులన్నీ ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తోందని.. దీంతో ప్రజలకు, సింగరేణి కార్మికులకు తీవ్ర నష్టం ఏర్పడే అవకాశం ఉందని, కేంద్ర ప్రభుత్వం వెంటనే సింగరేణి సంస్థలను ప్రైవేటీకరించడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సింగరేణిలో నాలుగు బ్లాగులను ప్రస్తుతం ప్రైవేట్ పరం చేయడానికి సిద్ధం చేశారని, దానిని నిరసిస్తూ కార్మికులు చేస్తున్న 72 గంటల పాటు తమ పార్టీ అనుబంధ సంస్థలు పూర్తి మద్దతు తెలుపుతాయన్నారు. సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాజబాబు, జిల్లా నాయకుడు పి. రాజేశ్వరరావు, పార్టీ అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ యూత్ అధ్యక్షులు చీమల సందీప్, డివిజన్ నాయకులు విలాస్ రావు తదితరులు పాల్గొన్నారు.