ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం… వారికి ఉచిత ప్రయాణం

by  |
ఆర్టీసీ మరో సంచలన నిర్ణయం… వారికి ఉచిత ప్రయాణం
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఈ నెల 10వ తేదీన ఆదివారం సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష రాసే వారికి శుభాకాంక్షలు చెబుతూ ఉచిత ప్రయాణం అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ , వరంగల్ లో జరిగే ఈ పరీక్షకు అభ్యర్థులు తమ కేంద్రాలకు చేరుకునేందుకు సిటీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. ఏసీ సిటీ బస్సును కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చని ఎండీ తెలిపారు. అయితే, అభ్యర్థులు తమ హాల్ టికెట్ ని చూపించి బస్ లో ప్రయాణం చేయొచ్చు.


Next Story

Most Viewed