- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: జిల్లా కేంద్రంలోని సరస్వతి నగర్లోని శ్రీ వెంకటేశ్వర ఆసుపత్రి ఆధ్వర్యంలో ఆదివారం పేదలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నగరంలోని పెద్ద బజార్ పేద ప్రజల కోసం శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో వైద్యులు డాక్టర్ రాజ్ కమల్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రజలకు పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. బీపీ, షుగర్ సంబంధిత వ్యాధుల పట్ల వైద్యులు అవగాహన కల్పించారు.
ఈ శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు హాజరై వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా డా.రాజ్ కమల్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రజల్లో ఉన్న అపోహలు, భయాందోళనలు పొగొట్టేందుకే ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలకు ఉచితంగానే పరీక్షలను నిర్వహించి మందులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆదివారం ఈ కార్యక్రమాన్ని జిల్లాలో కొనసాగిస్తున్నట్టు తెలిపారు.
Next Story