ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన కిషన్ రెడ్డి

by  |
ఉచిత అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించిన కిషన్ రెడ్డి
X

దిశ, సికింద్రాబాద్: మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఏడు సంవత్సరాలు అయిన సందర్భంగా సికింద్రాబాద్‌లో బీజేపి నాయకులు పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈసందర్భంగా బౌద్ధ నగర్ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ మేకల కీర్తి హర్ష కిరణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబులెన్స్ సర్వీస్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కరోనా కష్టకాలంలో ప్రజలకు తోడుగా ఉండాలని మేకల కీర్తి హర్ష కిరణ్ ఉచిత అంబులెన్స్ ప్రారంభించారని తెలిపారు. అదేవిధంగా సికింద్రాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ ఈ ఉచిత అంబులెన్సు సర్వీసుని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ఈ ఉచిత సర్వీస్ సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో 24 గంటలు సేవలు అందిస్తుందని, కరోనా పేషెంట్‌లను ఉచితంగా ఆస్పత్రికి తరలిస్తుందన్నారు. ఇతర వివరాలకు 9948919929 ,6302494434 సెల్ నెంబర్‌లను సంప్రదించాలని కోరారు.

Next Story

Most Viewed