ఆశపడ్డ అమాయకులను నిండా దోచేశారు

by  |
ఆశపడ్డ అమాయకులను నిండా దోచేశారు
X

దిశ, వెబ్‌డెస్క్ : బంగారం అంటే ఎవరికైన మక్కువే. మహిళలకు అయితే మరీ ఇష్టం. ప్రస్తుతం ఉన్న రోజుల్లో బంగారం ధర ఆకాశానంటుతోంది. సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తక్కువ ధరకే బంగారం ఇస్తాం అంటే ఎవరు మాత్రం ఆశపడరు.. అదే ఆశను సొమ్ము చేసుకున్నారు కేటుగాళ్లు. తాజాగా శంషాబాద్ లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

తక్కువ ధరకే బంగారం బిస్కెట్లు ఇప్పిస్తామంటూ నలుగురు నిందితులు మోసాలకు పాల్పడుతోంది. అమాయకులను టార్గెట్ చేస్తున్న ఈ ముఠా.. వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేసి నకిలీ బంగారం బిస్కెట్లు అంటగడుతుంది. ఈ సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆ నలుగురు కంత్రీగాళ్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 5.85కేజీల నకిలీ బంగారం బిస్కెట్లు, రూ.8 లక్షల నగదును స్వాధీనం చేశారు.


Next Story