నలుగురు జలసమాధి… గాలిస్తున్న అధికారులు

by  |
నలుగురు జలసమాధి… గాలిస్తున్న అధికారులు
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణానది ఒడ్డున చేపల వేటకు వెళ్లిన నలుగురు యువకులు శనివారం గల్లంతు అయిన విషయం తెలిసిందే. కాగా స్థానికుల సాయంతో సమాచారం అందుకున్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది నిన్నటి నుంచి గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఇద్దరు మృతదేహాలను గుర్తించి, వెలికి తీసిన అధికారులు, మరో ఇద్దరి కోసం ఆదివారం గాలిస్తున్నారు. కాగా గతకొన్ని రోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాకుండా పలు ప్రాజెక్టులకు వరదనీరు చేసి, ఎక్కడికక్కడ గేట్లు ఎత్తడంతో సందర్శకులు, స్థానిక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచనలు చేస్తున్నారు.

Next Story

Most Viewed