ఓ అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ.. చివరికి ఏం జరిగిందంటే..?

by  |
ఓ అమ్మాయి.. ఇద్దరు అబ్బాయిల మధ్య ప్రేమ.. చివరికి ఏం జరిగిందంటే..?
X

దిశ, వెబ్ డెస్క్: ఈ కాలంలో యువత త్వరగా ప్రేమలో పడిపోతున్నారు. ఆ వయసులో పుట్టే ఆకర్షణను ప్రేమ అనుకోని దాని కోసం ఎంతటి ఘోరానికైన తెగిస్తున్నారు. తాజాగా ఓ యువకుడు తాను ప్రేమిస్తున్న అమ్మాయిని మరో యువకుడు ప్రేమిస్తున్నాడని తెలిసి రగిలిపోయాడు. అతనిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని నడిరోడ్డుపై అతనిని హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..

ఢిల్లీ లోని అంబేద్కర్‌ నగర్‌లో నివాసముంటున్న కునాల్(19) కాలేజ్ లో చదివే తన స్నేహితురాలిని ఇష్టపడ్డాడు. అయితే అదే అమ్మాయిని గౌరవ్ అనే మరో యువకుడు ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి విషయమై వీరిద్దరికి తరుచు గొడవలు జరుగుతుండేవి.దీంతో గౌరవ్, కునాల్ ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశాడు. తన ముగ్గురు స్నేహితులతో కలిసి కునాల్ ఇంటి వద్ద మాటు వేశాడు. ఈ నేపథ్యంలోనే బుధవారం కునాల్ తన తండ్రి పుట్టినరోజు కావడంతో కేక్ తీసుకురావడానికి బయటికి వచ్చాడు. అప్పటికే మాటు వేసిన గౌరవ్, కునాల్ పై కత్తితో దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న యువకుడిని ఆసుపత్రికి తరలించగా.. అంతలోనే మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కునాల్ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం నిందితులు పరారీలో ఉన్నారని, వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed