పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులపై దాడి

by  |
పర్మిషన్ ఇవ్వలేదని పోలీసులపై దాడి
X

దిశ, ముంబయి: కరోనా కారణంగా హోలా మొహల్లా వేడుకలకు అనుమతినివ్వని పోలీసులపై గురుద్వార ఎదుటే దాడి జరిగింది. మహారాష్ట్ర నాందేడ్‌లో జరిగిన ఈ ఘటనలో నలుగురు పోలీసులు గాయపడ్డారు. ఈ కేసులో 17 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రతియేటా సిక్కులు మార్షల్ స్కిల్స్ ప్రదర్శించే హోలా మొహల్లా వేడుకలకు కరోనా కారణంగా పోలీసులు అనుమతినివ్వలేదు. ఇందుకు గురుద్వారా కూడా సమ్మతించింది. కానీ, సోమవారం నాలుగు గంటల సమయంలో 17 మందికిపైగా ఉన్న ఓ గుంపు కర్రలు, కత్తులతో హఠాత్తుగా గురుద్వార నుంచి బయటకు పరుగెత్తుకుంటూ వచ్చి బారికేడ్లను తోసిపారేసింది. పోలీసులపై దాడి చేసింది. ప్రస్తుతం పరిస్థితులు అదుపులో ఉన్నాయని, గాయపడ్డ నలుగురు పోలీసులకూ ప్రాణాపాయం లేదని రాష్ట్ర డీజీపీ రజనీశ్ సేథ్ వెల్లడించారు.

Next Story