కాపు కాసి సర్పంచ్ పై దాడి…

by  |
కాపు కాసి సర్పంచ్ పై దాడి…
X

దిశ, నర్సంపేట : బెల్టు షాపు దగ్గర కాపు కాసి ఓ సర్పంచ్‌ పై కొందరు వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన నల్లబెల్లి మండలంలోని మేడపల్లిలో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళితే…మేడపల్లి సర్పంచ్ లావుడ్య తిరుపతి.. మండల కేంద్రంలో పనులు ముగించుకొని సాయంత్రం లక్ష్మీ తండాలోని తన ఇంటికి బయలుదేరాడు. అప్పటికే మేడపల్లిలోని పీహెచ్‌సీకి సమీపంలోని ఓ బెల్ట్ షాపు దగ్గర కొందరు వ్యక్తులు కాపు కాశారు. ద్విచక్ర వాహనంపై మేడపల్లి శివారుకు సర్పంచ్ తిరుపతి చేరుకోగానే ఒక్కసారిగా అతనిపై వారు దాడి చేశారు.

కాగా తనను కులం పేరుతో దూషిస్తూ వంగర వెంకన్న, ఆకారపు అశోక్, ఆవుల రనీల్, మాలోతు మోహన్ అనే వ్యక్తులు తనపై దాడి చేసినట్టు బాధితుడు నల్లబెల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దాడి చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని సత్వర న్యాయం చేయవలసిందిగా బాధితుడు తిరుపతి ఫిర్యాదులో కోరారు.



Next Story