ఆటోను ఢీకొన్న కారు… నలుగురికి గాయలు

by  |
ఆటోను ఢీకొన్న కారు… నలుగురికి గాయలు
X

దిశ, వెబ్‌డెస్క్: చిట్యాలలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను వెనుక నుంచి కారు ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా చిట్యాల మండల పరిధిలోని జాతీయ రహదారి వద్ద వెల్మినేడు గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాళ్లోకి వెళితే… జాతీయ రహదారిపై నల్లగొండ నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ఆటోను వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి, ఆటోలో ప్రయాణిస్తున్న భార్యాభర్తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్సుల ద్వారా నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed