దంతెవాడలో ఘోరం.. ట్రాక్టర్ బావిలోపడి నలుగురు మృతి

by  |
tractor
X

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలోని దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ చెరువులో ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివాసీ దినోత్సవానికి వెళ్లి వస్తుండగా సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో ట్రాక్టర్‌లో 30 మంది ఆదివాసీలు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న సీఆర్‌ఫీఎస్ జవాన్లు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



Next Story

Most Viewed