ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

by  |
road accident
X

దిశ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఏడీబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఐదు నెలల చిన్నారి ఉన్నట్టు తెలుస్తోంది. గమనించిన స్థానికులు కారులో ఇరుక్కున్న ఐదుగురిని బయటకు తీసి, పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తు్న్నారు. తాళ్లరేపు మండలం పెద్దవలస నుంచి రాజమండ్రికి వెళ్తుండగా ఈ చోటుచేసుకుందని పోలీసులు నిర్ధారించారు.



Next Story

Most Viewed