అల్గునూర్‌లో ఘోర ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు

by  |
అల్గునూర్‌లో ఘోర ప్రమాదం.. నలుగురికి తీవ్ర గాయాలు
X

దిశ, మానకొండూరు : అల్గునూర్‌లోని ఐరిష్ స్కూల్ సమీపంలో ఉన్న భారత్ పెట్రోల్ పంప్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బంక్ పక్కనే ఉన్న చెట్టును అతివేగంతో వస్తున్న కారు ఢీకొనడంతో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై స్థానిక ఎస్‌ఐ ప్రమోద్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన సుహాన్ కుమార్ (28), భార్య శ్రీహస్, కొడుకు కళ్యాణ్, స్నేహితుడు తిరుపతిలతో దసరా సందర్భంగా హైదరాబాద్ వెళ్లి తిరిగి ఆదివారం కరీంనగర్‌కు కారులో వస్తున్నారు.

ఈ క్రమంలో అల్గునూర్‌లోని ఐరిష్ స్కూల్ సమీపంలో కారు అతివేగం వల్ల అదుపుతప్పి చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు బోల్తా పడగా వాహనంలో ఉన్నవారంతా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకున్న ఎల్ఎండీ పోలీసులు స్థానికుల సహాయంతో బాధితులను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.



Next Story