కొండచరియలు పడి నలుగురి మృతి

by  |

జమ్ముకశ్మీర్‌లో విషాదం చోటుచేసుకుంది. కొండచరియలు విరిగిపడి నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఉదంపూర్ సమీపంలోని ఘోర్డి ప్రాంతంలో మంగళవారం తెల్లవారుజామున ఓ ఇంటిపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో ఇంట్లో ఉంటున్న నలుగురు దుర్మరణం చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయ చర్యలు ప్రారంభించారు.

Tags: Four people died,,landslides broke out, jammu kashmir



Next Story

Most Viewed