- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కరోనా వైరస్ బారిన పడి మరొకరు మృతిచెందారు. కాజీపేటకు చెందిన షకీల్ అనే వ్యక్తి పరిస్థితి విషమించడంతో సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కాగా ఆదివారం ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో నాలుగు పాజిటివ్ కేసులు నమోదైనట్టు ఎంజీఎం వైద్యులు తెలిపారు. వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండ పట్టణంలోని విజయనగర్ కాలనీకి చెందిన ఓ యువకుడు(26), అడ్వకేట్ కాలనీకి చెందిన మహిళా(41), హుజురాబాద్, మహదేవ్పూర్లకు చెందిన మరో ఇద్దరు మహిళలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు వైద్యులు తెలిపారు.
Next Story