బ్రేకింగ్ న్యూస్: ఆ ఉగ్రవాది లొంగిపోయాడు

by  |
బ్రేకింగ్ న్యూస్: ఆ ఉగ్రవాది లొంగిపోయాడు
X

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలోని కిలోరా గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఉగ్రవాదులు శుక్రవారం మృతి చెందిన విషయం తెలిసిందే. కేంద్రపాలిత ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లలో ఇది ఒకటి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది లొంగిపోయాడని పోలీసులు తెలిపారు. చనిపోయిన ఉగ్రవాదులలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్త నిసార్ అహ్మద్ భట్ మృతదేహం ఆపిల్ తోటలో దొరికిన కొద్ది గంటలకే ఈ ఎన్‌కౌంటర్ జరిగిందని, మిస్టర్ భట్ ను 10 రోజుల క్రితం ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని పోలీసులు తెలిపారు.

షోపియన్‌లోని ఓ గ్రామంలో ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు తమకు సమాచారం వచ్చింది. ఈ క్రమంలో సైన్యం, పోలీసులు, పారా మిలటరీ సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్ ను ప్రారంభించాయి. ఈ క్రమంలో కాల్పుల్లో చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృతిచెందారు. ఈ విషయాన్ని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు.

Next Story

Most Viewed