సిక్కోలులో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..

by  |
సిక్కోలులో తీవ్ర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు..
X

దిశ, ఏపీ బ్యూరో: శ్రీకాకుళం జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. జి.సిగడాం మండలంలోని జగన్నాథవలసలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. బావిలో దూకి తల్లి, ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు తల్లి భోగేశ్వరి, పిల్లలు చక్రి, జయలక్ష్మి, భరత్‌ కుమార్‌గా గుర్తించారు. కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారా..? లేక హత్య అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

Next Story

Most Viewed