గోదావరిలో నాలుగు మృతదేహాలు లభ్యం..

by  |

దిశ, వెబ్‌డెస్క్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గోదావరి నదిలో గల్లంతైన మరో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. దీపావళి పండుగ రోజు (శనివారం) మరికాల రేవు దగ్గర గోదావరిలో నదిలో స్నానం కోసం దిగిన నలుగురు యువకులు గల్లంతైన విషయం తెలిసిందే. వారిలో ప్రకాష్, కార్తీక్ మృతదేహాలు ఇదివరకే దొరకగా, తాజాగా శ్రీకాంత్, అన్వేష్ డెడ్ బాడీలను వెలికితీశారు.

ఇదిలాఉండగా, 16మంది మిత్ర బృందం పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు గోదావరి నది తీరానికి వెళ్లారు. అందులో కొందరు సరదగా ఈతకొట్టేందుకు నదిలోకి దిగారు. వారిలో నలుగురు ప్రవాహానికి కొట్టుకుపోగా ఇద్దరి మృతదేహాలు నిన్న దొరకగా, ఇవాళ మరోఇద్దరి బాడీలు లభ్యమయ్యాయి.

Next Story

Most Viewed