నలుగురి ప్రాణం తీసిన మందు బాబులు

by  |
నలుగురి ప్రాణం తీసిన మందు బాబులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మందుబాబులు రెచ్చిపోతున్నారు. మద్యం తాగి యథేచ్ఛగా వాహనం నడుపుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. సమయంతో పనిలేకుండా తాగేసి విచ్చలవిడిగా వాహనమెక్కి విహరిస్తున్నారు. దీంతో సోమవారం ఒక్క రోజులోనే మద్యంబాబుల నిర్లక్ష్య డ్రైవింగ్‌తో నలుగురు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన రెండు యాక్సిడెంట్లలో ఈ విషాదం నెలకొంది.

సోమవారం ఉదయం 2 గంటల సమయంలో రోహితం అనే వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపి బంజారాహిల్స్ ప్రాంతంలో రోడ్డుపై వెళ్తోన్న ఇద్దరిని ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మరువకముందే నగరంలోని నార్సింగి ప్రాంతంలో సంజీవ్ అనే వ్యక్తి మద్యం మత్తులో బైక్‌పై వెళ్తోన్న దంపతులను ఢీ కొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృ‌తి చెందారు. ఇలా ఒక్క రోజులో నలుగురు మృతి చెందారు. వాహనదారులకు పోలీసులు ఎంత అవగాహన కల్పించిన ఎలాంటి మార్పు రావడం లేదు. కేసులు పెట్టినా మద్యం మత్తులో వాహనం నడుపుతూ ఇతర వాహనదారుల ప్రాణాలను హరిస్తున్నారు. ఇలా ఒక్కరోజులోనే హైదరాబాద్‌లో నలుగురు మృతి చెందడంతో రోడ్డెక్కాలంటేనే వాహనదారులు భయాందోళనకు గురికావాల్సి వస్తోంది.

Next Story