- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అయోధ్యకు రాష్ట్రపతిని పిలవాల్సింది…
<p>దిశ, వెబ్డెస్క్: బీఎస్పీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ పూజా కార్యక్రమానికి ప్రధానితో పాటు దళిత సామాజిక వర్గానికి చెందిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా పిలవాల్సింది అని అన్నారు. మరోవైపు […]</p>

X
దిశ, వెబ్డెస్క్: బీఎస్పీ పార్టీ అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 5వ తేదీని ఉత్తర ప్రదేశ్లోని అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోడీ భూమిపూజ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ఈ పూజా కార్యక్రమానికి ప్రధానితో పాటు దళిత సామాజిక వర్గానికి చెందిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కూడా పిలవాల్సింది అని అన్నారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. పరుశురాముడి విగ్రహం గురించి మాట్లాడటం కంటే, ఎస్పీ అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని ఎద్దేవా చేశారు.
Next Story






