కేంద్ర మాజీ మంత్రి రషీద్ మృతి

by  |
కేంద్ర మాజీ మంత్రి రషీద్ మృతి
X

దిశ, వెబ్‌డెస్క్: గతంలో కరోనా బారినపడి, కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్ర మాజీ మంత్రి రషీద్ మసూద్(73) సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇటీవల అనారోగ్యంతో రూర్కిలోని ఓ నర్సింగ్‌హోంలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయాన్ని మసూద్ మేనల్లుడు ఇమ్రాన్ మీడియాకు వెల్లడించారు. కాగా రషీద్ మసూద్ ఐదుసార్లు లోక్‌సభకు, పలు దఫాలు రాజ్యసభకు ఆయన ఎంపికయ్యారు. 1889లో జనతాదళ్ తరఫున లోక్‌సభకు ఎన్నికైన మసూద్ అప్పటి ప్రభుత్వంలో ఆరోగ్యశాఖ సహాయమంత్రిగా కూడా పనిచేశారు.

Next Story

Most Viewed