కేసీఆర్​కు చర్లపల్లి జైలే గతి : పొన్నాల

by  |
కేసీఆర్​కు చర్లపల్లి జైలే గతి : పొన్నాల
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, త్వరలో సీఎం కేసీఆర్​కు చర్లపల్లి జైలే గతి అవుతుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. శనివారం గాంధీభవన్​లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో సీఎం దుబ్బాకకు వెళ్లకుండా కొడకండ్లకు వెళ్లి మాట్లాడారన్నారు. హైదరాబాద్​కు ప్రధాని వచ్చినా సీఎంకు ఆహ్వానం లేకపోవడం తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనన్నారు. టీఆర్​ఎస్ బహిరంగ సభ జనం లేక వెలవెలబోయిందని, టీఆర్​ఎస్​ వెంట జనం లేరన్నారు. వరద బాధితుల గురించి మాట్లాడుతున్నారని, తెలంగాణ వ్యాప్తంగా ఎందుకు నష్టపరిహారం ఇవ్వలేదని పొన్నాల ప్రశ్నించారు.

హైదరాబాద్​లో కాల్వలు, రోడ్లకు ఏటా రూ. 10 వేల కోట్లు ఖర్చు చేస్తామంటున్నారని, ఇంతకాలం ఎందుకు చేయలేదని, గత గ్రేటర్​ ఎన్నికల్లో చెప్పిన లక్ష ఇండ్ల సంగతి ఎందుకు మాట్లాడటం లేదని, వంద రోజుల ప్రణాళిక ఏమైందన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్​ హైదరాబాద్​ వరదల గురించి మాట్లాడారని, అధికారంలోకి వచ్చిన ఆరేండ్లలో ఎందుకు చర్యలు చేపట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ నిజస్వరూపం బయటపడిందని, అవినీతిలో కూరుకుపోయారన్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్​కు రావడం రాజకీయ ఉద్ధేశ్యమేనని, ఏడె కంపెనీలు కరోనా వ్యాక్సిన్​ తయారు చేస్తుంటే మూడు కంపెనీలు మాత్రమే ఎందుకు పరీక్షించారని బీజేపీ పార్టీ అగ్ర నాయకులంతా హైదరాబాద్​లో ఉంటే మేడీ రావడం ఎన్నికల కుతంత్రమేనని పొన్నాల ఆరోపించారు.

Next Story

Most Viewed