టీమిండియాపై సెహ్వాగ్ కౌంటర్

by  |
టీమిండియాపై సెహ్వాగ్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్-ఆసీస్ మధ్య జరిగిన మొదటి డే-నైట్ టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 36 పరుగులకే 9 వికెట్లు కోల్పోయి ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అత్యంత తక్కువ స్కోర్‌కు ఆలౌట్ అయి చెత్త రికార్డు మూటగట్టుకోవడంతో భరించలేకపోతున్నారు. దీంతో మాజీ డాషింగ్ ఓపెనర్, డ్యాషింగ్ బ్యాట్స్‌మన్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శించారు. భారత బ్యాటింగ్‌ను ఓటీపీతో పోల్చాడు. ట్విట్టర్ వేదికగా ట్రోల్ చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లలో ఒక్కరంటే ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయకపోవడం గమనార్హం. వరుసగా.. 4,9,2,0,4,0,8,4,0,4,1 పరుగులు చేశారు. టీమిండియా ఆటగాళ్ల ప్రదర్శనను ఓటీపీతో పోల్చిన సెహ్వాగ్.. దీనిని ఎవరూ గుర్తుపెట్టుకోవాలని అనుకోరని అన్నాడు. ఓటమిని మర్చిపోవడానికి ఓటీపీ ఇదేనంటూ ఆటగాళ్లు చేసిన వ్యక్తిగత స్కోర్లను (49204084041)ను పేర్కొన్నాడు. దీంతో మొత్తంగా 89 పరుగుల ఆధిక్యం లభించగా, 90 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా సునాయాసంగా విజయాన్ని అందుకుంది.

Next Story

Most Viewed