మాజీ ఎంపీ ఉండవల్లికి పాజిటివ్..

by  |
మాజీ ఎంపీ ఉండవల్లికి పాజిటివ్..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌కు కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు వైద్యులు ధృవీకరించారు. రెండ్రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతుండగా.. తాజాగా నిర్వహించుకున్న టెస్టుల్లో పాజిటివ్ అని తేలింది.

దీంతో ఆయన వెంటనే ఆస్పత్రిలో ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. ఇదిలాఉండగా, ఉండవల్లి త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆయన నన్నిహితులు, అభిమానులు, పలువురు నేతలు ఆకాంక్షిస్తున్నారు.

Next Story

Most Viewed