ఆయన ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు

by  |
ఆయన ఉన్నంత వరకు ఎన్నికలు జరగవు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌పై టీడీపీ కీలక నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హయాంలో ఎన్నికలు జరిగే అవకాశం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినా… ఎవరో ఒకరు కోర్టుకు వెళ్లడం ఖాయం అని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ఏపీ సర్కార్ ఆలస్యం చేయడం వెనక ఎత్తుగడ ఉందని అన్నారు. అంతేగాకుండా నంద్యాల ఘటన బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.



Next Story