ఆ విష‌యంపై ముఖ్య‌మంత్రిని క‌లుస్తా : పొంగులేటి

by  |
ఆ విష‌యంపై ముఖ్య‌మంత్రిని క‌లుస్తా  : పొంగులేటి
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: గోళ్లపాడు నిర్వాసితులకు న్యాయం కోసం ముఖ్యమంత్రిని కలుస్తానని బీజేపీ జాతీయ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. జిల్లా బీజేపీ నాయకులతో కలసి పంపింగ్ వెల్ రోడ్‌లో గోళ్లపాడు నిర్వాసితులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… గోళ్లపాడు నిర్వాసితులపై ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచన చేయాలని, 2016లో సీఎం హామీ ఇచ్చిన విధంగా ఇళ్ల నిర్మాణానికి సాయం చేయాలని కోరారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని కలసి విజ్ఞప్తి చేస్తానని అన్నారు.

Next Story

Most Viewed