‘కళ్లుండి కూడా చూడలేకపోవడం దారుణం’

by  |
‘కళ్లుండి కూడా చూడలేకపోవడం దారుణం’
X

దిశ, అచ్చంపేట: నిత్యం చౌకబారు విమర్శలు చేసే మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇపటికైనా, ఆ విమర్శలు మానుకోవాలని ప్రభుత్వ విప్ గువ్వల బలరాజ్ అన్నారు. సోమవారం నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలంలో మాచారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన బాలరాజు, అనంతరం మీడియాతో మాట్లాడారు. కరోనా సమయంలో ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం చేస్తున్న సహకారాన్ని, కళ్ళుండి చూడలేక పోవడం దారుణం అన్నారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌లో ఈ ప్రాంతానికి చుక్క నీరైనా తేవడానికి మీ వంతు కృషి ఎక్కడైనా జరిగిందా అని సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉప్పునుంతల మండలానికి 70 శాతం, లింగాల మండలానికి 70 శాతం, వంగూరు మండలానికి 75% సాగునీరు వచ్చాయని తెలిపారు. హరితహారంపై తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు.

Next Story