కేసీఆర్ అసమర్థతను ప్రజలకు వివరించడండి.. రేవూరి పిలుపు

by  |
Former MLA Revuri Prakash Reddy
X

దిశ, నల్లబెల్లి: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో పెద్ద ఎత్తున ఇతర పార్టీలకు చెందిన యువకులు బీజేపీలో చేరారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నివాసంలో మండల పార్టీ ఇన్‌చార్జి నల్లబెల్లి సుదర్శన్ ఆధ్వర్యంలో గోవిందపురం గ్రామానికి చెందిన స్నేహ యూత్ సభ్యులు కొట్టం రాజు, కుంజ మహేష్‌తో పాటు 25మంది బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా వారికి రేవూరి ప్రకాష్ రెడ్డి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో రానున్నది బీజేపీ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలందరూ కేంద్రం ప్రవేశ పెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటే లక్ష్యంగా పనిచేస్తూ.. గ్రామ గ్రామాన పార్టీని బలోపేతం చేయాలన్నారు. పార్టీలో సిద్ధాంతం కోసం నిబద్ధతతో పనిచేసే ప్రతీ ఒక్కరికీ గుర్తింపు ఉంటుందన్నారు. కేసీఆర్ చేసిన మోసాలు ప్రజలకు వివరిస్తూ.. ప్రపంచంలో భారత దేశాన్ని అగ్రగామిగా నిలబెట్టిన మోడీ నాయకత్వాన్ని బలపర్చాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బుద్దిరెడ్డి ప్రతాపరెడ్డి, ప్రధాన కార్యదర్శులు వల్లె రమేష్, బొట్ల పవన్, శ్రీనివాస్ రెడ్డి, యశోద శరత్, మామిండ్ల ఐలయ్య పాల్గొన్నారు.


Next Story