- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, యాదగిరిగుట్ట : తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీ, జడ్పీటీసీల సంఘం సమావేశాన్ని బుధవారం తెలంగాణ పంచాయతీరాజ్ ఛాంబర్లో జరిగింది. ఇందులో ఆలేరు మాజీ ఎమ్మెల్యే జడ్పీ ఫ్లోర్ లీడర్ తెలంగాణ రాష్ట్ర జడ్పీటీసీల సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ కుడుదుల నగేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంఘం తరపున సభ్యులను ఎన్నికల బరిలో నిలుపుతామని, దీనికి అందరూ సహకరించాలని కోరారు.
సంఘం సభ్యులను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీలను చిన్న చూపు చూస్తుందని.. ఎంపీటీసీ, జడ్పీటీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ తెరాస అభ్యర్థులను ఓడగొట్టి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అందరూ తప్పకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీ సంఘానికి గౌరవం ఇచ్చి సంఘం నిర్ణయించిన అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.