భారత్ బంద్‌తో ఆ రెండ్ పార్టీలకు తెలిసిరావాలి : మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి

by  |
భారత్ బంద్‌తో ఆ రెండ్ పార్టీలకు తెలిసిరావాలి : మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి
X

దిశ, జ‌న‌గామ : జ‌న‌గామ నియోజ‌క‌వ‌ర్గంలో ఈనెల 27న జ‌ర‌గ‌బోయే అఖిలపక్ష భారత్ బంద్‌లో అన్ని పార్టీల నాయ‌కులు పెద్ద సంఖ్య‌లో పాల్గొనాల‌ని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు. ఉదయం నుంచి అన్ని మండల కేంద్రాల్లో నిర్వహించే రాస్తారోకోలో పాల్గొని విజయవంతం చేయాలని ఆదివారం కొమ్మూరి ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ పాలనలో అడ్డూ అదుపు లేకుండా ధరలు పెరగడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందుకు గురవుతున్నారని ఆరోపించారు. సోమవారం జరిగే భారత్‌బంద్ కార్యక్రమంలో ప్రజలతో పాటు వ్యాపారస్తులు, అన్నివర్గాల ప్రజలు సహకరించాలని కోరారు.


Next Story