కరోనా మృతదేహానికి మాజీ ఎమ్మెల్యే అంత్యక్రియలు

by  |
Vemula Veeresham
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా కష్టకాలంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బాధితులకు చేయూతనిస్తున్నారు. ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు దగ్గరుండి అంత్యక్రియలు చేస్తున్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని 8వ వార్డు వాసవీనగర్‌కు చెందిన కోమటిరెడ్డి లక్ష్మమ్మ కరోనాతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితిలో లేకపోవడంతో తానే ముందుండి అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు.

మృతదేహం ఖననం కోసం దగ్గరుండి జేసీబీతో గుంత తీయించడంతోపాటు అంత్యక్రియలను తన సొంత ఖర్చులతో పూర్తి చేశారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. లక్ష్మమ్మ కుటుంబానికి ఎలాంటి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు ప్రజలందరు జాగ్రత్తలు వేముల వీరేశం కోరారు.



Next Story

Most Viewed