- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: కరోనా కష్టకాలంలో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం బాధితులకు చేయూతనిస్తున్నారు. ఆర్థికంగా ఆదుకోవడంతోపాటు దగ్గరుండి అంత్యక్రియలు చేస్తున్నారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని 8వ వార్డు వాసవీనగర్కు చెందిన కోమటిరెడ్డి లక్ష్మమ్మ కరోనాతో మృతి చెందింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేసే పరిస్థితిలో లేకపోవడంతో తానే ముందుండి అంతిమ కార్యక్రమాలు పూర్తి చేశారు.
మృతదేహం ఖననం కోసం దగ్గరుండి జేసీబీతో గుంత తీయించడంతోపాటు అంత్యక్రియలను తన సొంత ఖర్చులతో పూర్తి చేశారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చారు. లక్ష్మమ్మ కుటుంబానికి ఎలాంటి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో తాను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి సాయం కావాలన్నా చేస్తానని భరోసా ఇచ్చారు. కరోనా నుంచి రక్షించుకునేందుకు ప్రజలందరు జాగ్రత్తలు వేముల వీరేశం కోరారు.