- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణలో వరుస విజయాలతో ఊపుమీద ఉన్న భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ పార్టీ పగ్గాలు చేపట్టాక మొదటిసారి రాష్ట్రంలో బీజేపీకి ఎదురు దెబ్బపడింది. బీజేపీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్ష పదవికి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇవాళ శేఖర్ను ఓ మీడియా ప్రతినిధి ఫోన్ ద్వారా సంప్రదించగా.. తన రాజీనామాను ధ్రువీకరించారు. అంతేగాకుండా త్వరలో తన రాజీనామాను మీడియాకు బహిరంగంగా వెల్లడిస్తానని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం పార్టీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటనలో ఉండగానే, ఎర్ర శేఖర్ రాజీనామా ప్రకటించి సంచలనం సృష్టించారు. మరి దీనిపై బండి సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Next Story