ఆందోళన చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారా !

by  |
ఆందోళన చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటారా !
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై మాజీ మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. రాజధానికి ఆనాడు రైతులు భూములిస్తే ఇప్పుడు అదే రైతులకు బేడీలు వేసే పరిస్థితులు తెచ్చారని విమర్శించారు. ఏం తప్పు చేశారని రైతుల చేతులకు బేడీలు వేశారని ప్రశ్నించారు. ఐదుకోట్ల ఆంధ్రుల కోసం రైతులు భూములు ఇచ్చారని, రాజధాని కోసం రైతులు ఆందోళనలు చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని దోచుకున్న జగన్‌కు బేడీలు తప్పవని వ్యాఖ్యానించారు.


Next Story