‘మూడు రాజధానుల నిర్ణయం పెద్ద తప్పు’

by  |
‘మూడు రాజధానుల నిర్ణయం పెద్ద తప్పు’
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని, టీడీపీ కీలక నేత, మాజీమంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం జవహర్ మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి కొడాలి నాని అవాకులు, చవాకులు మాట్లాడుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైసీపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయమే పెద్ద తప్పు అన్నారు. కొడాలి నాని మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శలు చేశారు. ఎవరిని అడిగి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండొద్దని మంత్రి నాని అంటున్నారని, దీనిపై సీఎం జగన్‌తో పాటు మంత్రులు కూడా ఎవరూ నోరు మెదపడం లేదని జవహర్ ఫైర్ అయ్యారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story