‘ఆ శాఖలో భారీ కుంభకోణం జరిగింది’

by  |
‘ఆ శాఖలో భారీ కుంభకోణం జరిగింది’
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ కీలక నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు వైసీపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ఆర్‌అండ్‌బీ శాఖలో భారీ స్కామ్‌ జరిగిందని ఆరోపణలు చేశారు. రూ.6,400 కోట్ల నిధులతో బ్రిడ్జిలు, కల్వర్టులు నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఎన్‌డీబీ 70 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఖర్చు చేయాల్సి ఉందని వెల్లడించారు.

రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం వచ్చాక కొత్తగా మళ్లీ టెండర్లు పిలిచిందని తెలిపారు. రాయలసీమకు చెందిన మంత్రి, ఆయన కుమారుడు, అనుచరుల కంపెనీలకు రూ.6,400కోట్ల కాంట్రాక్టులను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని అయ్యన్నపాత్రుడు డిమాండ్ చేశారు.



Next Story

Most Viewed