కాసేపట్లో ఈటల ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన చేసే అవకాశం

by  |
కాసేపట్లో ఈటల ప్రెస్‌మీట్.. కీలక ప్రకటన చేసే అవకాశం
X

దిశ, వెబ్‌డెస్క్: భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈటల రాజేందర్‌ను సీఎం కేసీఆర్‌ తన మంత్రివర్గం నుంచి ఆదివారం బర్తరఫ్‌ చేశారు. ఈటల నుంచి వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలను తప్పించిన గంటల వ్యవధిలోనే కేబినెట్‌ నుంచి కూడా బయటికి పంపించిన విషయం తెలిసిందే. అయితే.. దీనిపై కాపేపట్లో ఈటల కీలక విషయలు వెల్లడించనున్నారు. సోమవారం ఉదయం 11 గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు. కాగా, ఈ ప్రెస్‌మీట్‌లో భవిష్యత్ కార్యచరణను ప్రకటించనున్నారు. కేబినెట్ నుంచి బర్తరఫ్ అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి, కీలక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. అనంతరం తనపై వచ్చిన ఆరోపణలపై, ప్రభుత్వ విచారణపై న్యాయస్థానాన్ని ఆశ్రయించనున్నట్టు తెలుస్తోంది.

Next Story

Most Viewed