మాజీ సీఎం రోశయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు

by  |
మాజీ సీఎం రోశయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు
X

దిశ, వనపర్తి : తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య అకాల మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలో‌ని చౌరస్తాలో రోశయ్య చిత్రపటానికి మాజీ మంత్రి చిన్నారెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ.. మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య కాంగ్రెస్ పార్టీ కి ఎన్నోసేవలు అందించారని ఆయన సేవలు మరువలేనివని అన్నారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు శ్రీనివాస్ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య, పట్టణ అధ్యక్షులు కిరణ్ కుమార్, మాజీ ఎంపీపీ శంకర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed