కేసీఆర్‌కు బుద్ది చెప్పాలి: కార్తీకరెడ్డి

by  |
కేసీఆర్‌కు బుద్ది చెప్పాలి: కార్తీకరెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేసిఆర్ పార్టీకి బుద్దిచెప్పాల్సిన అవసరముందని, కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన బండ కార్తీకరెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్ సమక్షలో బుధవారం ఆమె పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కార్తీకరెడ్డి మాట్లాడుతూ.. హైదరాబాద్‌ను భాగ్యనగరం పేరుతో పిలవడం ఖాయమని ఆమె జోస్యం చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 2023లో గోల్కొండ కోటపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. బీజేపీలో తనకు అన్యాయం జరగదని, సిద్దాంతాలున్న పార్టీగా నేను నమ్ముతున్నానని అందుకే 30ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని ప్రక్కన పెట్టి పార్టీలో చేరుతున్నట్టు పేర్కొన్నారు. అటు.. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్, ఆయన కుమారుడు రవి యాదవ్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ… అధికార పార్టీని ప్రశ్నించే గొంతుక బీజేపీయేనని స్పష్టం చేశారు.


Next Story

Most Viewed