ఇక్కడ రాబోయే రోజులు… బీజేపీకి అనుకూలం

by  |
ఇక్కడ రాబోయే రోజులు… బీజేపీకి అనుకూలం
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాబోయే రోజులు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన తెలంగాణ గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలను సమర్థించారు. ఒక డాక్టర్‌గా కరోనాపై గవర్నర్ ప్రభుత్వానికి సూచనలు చేశారన్నారు.

తెలంగాణ కంటే బలహీనంగా ఉన్న రాష్ట్రాల్లో సైతం అధికారంలోకి వచ్చామన్నారు. కరోనా కట్టడికి చికిత్సను వికేంద్రీకరణ చేయాలన్నారు. కరోనా చికిత్స అంటే గాంధీ ఆస్పత్రి మాత్రమే కాదని, 33 జిల్లాల్లోని ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు సదుపాయాలు కల్పించాలన్నారు. బడుగు బలహీన వర్గాలకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాసాగర్‌రావు అన్నారు.


Next Story

Most Viewed