- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తాను బహుజన సమాజ్ వాదీ పార్టీ (BSP)లో చేరుతున్నట్టు గత మూడ్రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో కథనాలు రావడంపై మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి స్పందించారు. తాను బీఎస్పీలో చేరబోవడం లేదంటూ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రసార, సామాజిక మాద్యమాల్లో విస్తృతంగా జరిగిన ప్రచారం అంతా తప్పు అని.. దయచేసి ఈ విషయాన్ని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేయాలని కోరారు.
ఇదిలాఉండగా, తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ఆకునూరి మురళి లానే వాలెంటరీ రిటైర్ మెంట్ తీసుకుని బీఎస్పీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, ప్రవీణ్ కుమార్ బాటలోనే మాజీ ఐఏఎస్ అధికారి మురళి నడుస్తారంటూ పలు కథనాలు రావడంపై ఎట్టకేలకు ఆయన స్పందించి ఈ ప్రచారానికి పుల్స్టాప్ పెట్టారు.
Next Story