- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, వెబ్డెస్క్: గుజరాత్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత మాధవ్సింగ్ సోలంకి కన్నుమూశారు. 94 ఏళ్ల మాధవ్ సింగ్ గాంధీనగర్లోని తన నివాసంలో శనివారం తుది శ్వాస విడిచారు. మాధవ్ సింగ్ సోలంకి కేంద్ర విదేశాంగ మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన 1980ల్లో గుజరాత్లో కేహెచ్ఏఎం (క్షత్రియా, హరిజన, ఆదివాసీ, ముస్లిం) సూత్రంపై అధికారంలోకి వచ్చారు. 1980 ఎన్నికలకు ముందు కేహెచ్ఏఎం కూటమిని ఏర్పాటు చేశారు. సోలంకి వృత్తిరీత్యా న్యాయవాది. 1976లో కొంతకాలం ముఖ్యమంత్రి పని చేశారు. మళ్లీ 1981లో సీఎంగా ఎన్నికయ్యారు. 1985లో రాజీనామా చేసినప్పటికీ తర్వాత జరిగిన ఎన్నికల్లో 182 అసెంబ్లీ స్థానాలకు గాను 149 గెలిచి తిరిగి అధికారంలోకి వచ్చారు.
మాధవ్ సింగ్ సోలంకి మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. దశాబ్దాల పాటు గుజరాత్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన సోలంకి బలీయమైన నాయకుడని కొనియాడారు. సమాజానికి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.