డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ మాజీ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు

by  |
డ్రగ్స్ కేసుపై ఎక్సైజ్ మాజీ కమిషనర్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాజకీయ అండదండలతోనే డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతుందని మాజీ ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ మాఫియా కేసులో హై ఫ్రొఫైల్ కలిగిన వ్యక్తులు దాదాపు 30మంది ఉన్నట్టు తెలిపారు. అయితే, డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్న అసలైన హై ఫ్రొఫైల్ కలిగిన వారిని తప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ సాధారణ కేసులాగే తూతూ మంత్రంలాగే కొనసాగుతోందని ఘాటుగా ఆరోపణలు చేశారు. చంద్రవదన్ రిటైర్మెంట్ అనంతరం బీజేపీలో చేరడంతో పలువురు రాజకీయ వ్యాఖ్యలుగానే భావిస్తుండగా, ఆయన గతంలో ఇదే శాఖకు కమిషనర్‌గా పనిచేయడంతో అత్యంత ప్రాధాన్యత సంతరించుకుందని మరికొందరు భావిస్తున్నారు.


Next Story

Most Viewed