కామారెడ్డి కొనుగోలు కేంద్రంలో రైతు మృతి

by  |
కామారెడ్డి కొనుగోలు కేంద్రంలో రైతు మృతి
X

దిశ, నిజామాబాద్: ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతు మృతిచెందిన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని లింగంపేట మండలం పోల్కంపేట గ్రామానికి చెందిన మాల భూమయ్య (55) మంగళవారం కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం ఆరబోసి చెట్టు కింద పడుకున్నారు. నిద్రలోనే కన్నుమూసినట్టు కుటుంబ సభ్యులు వెల్లడించారు. అంతకుముందు కేంద్రానికి తీసుకువచ్చిన ధాన్యంలో తేమ ఉందని తూకం వేయడానికి అధికారులు 29వ టోకెన్ ఇచ్చారు. దీంతో ధాన్యాన్నికొనుగోలు కేంద్రం వద్దే ఆరబోసి పక్షులకు కాపలాగా పడుకున్న భూమయ్య నిద్రలోనే మృతిచెందాడు.

Tags: farmer died, purchasing center, kamareddy dist

Next Story

Most Viewed